టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్పై సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఇషాన్ అసలు ఏం అనుకుంటున్నాడని.. అతడికి అంత పొగరు ఎందుకని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
క్రికెట్లో ఒకప్పడు సంప్రదాయ టెస్టులను మాత్రమే బెస్ట్ ఫార్మాట్గా భావించేవారు. అయితే రోజులకు తరబడి జరిగే టెస్టుల కంటే ఇంకేదైనా ఎంటర్టైనింగ్గా ప్లాన్ చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చినవే వన్డేలు. ఏడెనిమిది గంటల్లో ముగిసే 50 ఓవర్ల ఫార్మాట్ ఫుల్ సక్సెస్ అయింది. 90వ దశకం నుంచి నిన్నమొన్నటి వరకు క్రికెట్లో ఓడీఐలదే హవా. అయితే టీ20ల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారింది. మూడు గంటల్లో ముగిసే ధనాధన్ క్రికెట్కు అందరూ అడిక్ట్ అయిపోయారు. ఇవాళ్టి ఫాస్టర్ జనరేషన్ టీ20లకు ఇట్టే అలవాటు పడిపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పొట్టి క్రికెట్ లీగ్లు పుట్టుకొచ్చేశాయి. ఐపీఎల్, బిగ్బాష్, పీఎస్ఎల్, బీపీఎల్, ఎల్పీఎల్.. ఇలా లెక్కకు మించి లీగ్లు వచ్చేశాయి. పాపులారిటీతో పాటు రూ.కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుండటంతో వీటిల్లో ఆడేందుకు ప్లేయర్లూ ఆసక్తి చూపిస్తున్నారు.
లీగ్స్లో ఆడటంలో తప్పులేదు గానీ వాటి కోసం జాతీయ జట్టుకు, డొమెస్టిక్ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. భారత్ వరకు చూసుకున్నా.. చాలా మంది ప్లేయర్లు టీమిండియాలోకి అడుగు పెట్టేంత వరకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు. ఒక్కసారి ఛాన్స్ వచ్చాక ఆడితే భారత్కు ఆడాలి.. లేదంటే ఐపీఎల్లో ఆడాలి అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు. తమకు లైఫ్ ఇచ్చిన దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉంటున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో ఆడటం ద్వారా తమ ఆటను ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు అనుభవాలను యువ ప్లేయర్లతో పంచుకుందామనే భావన వారిలో కనిపించడం లేదు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆడే టీమ్కు ఎంపికైన ఇషాన్.. ప్రతిష్టాత్మక మ్యాచ్లో తుదిజట్టులో ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో సిరీస్కు మరో నెల రోజుల టైమ్ ఉంది. దీంతో ఇషాన్ రెస్ట్ తీసుకుంటున్నాడు.
దులీప్ ట్రోఫీలో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఈస్టో జోన్ నుంచి ఇషాన్ కిషన్కు ఆహ్వానం అందింది. అయితే ఆ టోర్నీలో ఆడేందుకు అతడు నో చెప్పాడు. కెప్టెన్గా ముందుండి టీమ్ను లీడ్ చేయాల్సిందిగా ఆహ్వానం అందినా ఇషాన్ సున్నితంగా తిరస్కరించాడట. దులీప్ ట్రోఫీలో ఆడే ఆసక్తి తనకు లేదని ఇషాన్ జవాబు చెప్పాడని సమాచారం. ఎలాంటి గాయం కాకపోయినా, పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ ఇషాన్ ఆడనని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. భారత్ తరఫున ఇప్పట్లో మ్యాచ్లు లేకున్నా అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్కు నో చెప్పడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట తప్పుబడుతున్నారు. ఇషాన్కు యాటిట్యూడ్ ఎక్కువైందని ట్రోల్ చేస్తున్నారు. కాసులు కురిపించే ఐపీఎల్లోనే ఆడతావా? డొమెస్టిక్ టోర్నీల్లో ఆడవా? ఇంత పొగరు అవసరమా అంటూ ఇషాన్పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి.. దులీప్ ట్రోఫీలో ఆడనని చెబుతూ ఇషాన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI Selectors to PTI, “As he (Ishan Kishan) is a senior India regular in white ball, he would have got the captaincy. Chakraborty got in touch with Ishan over phone and came back and told us that he is not interested in playing Duleep Trophy. We were not told if he has an injury… pic.twitter.com/K2vIWDuZpP
— CricketGully (@thecricketgully) June 15, 2023