గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్ లోకావాల్సిన పరుగులు పిండుకుని జట్టును విజయతీరానికి చేర్చి గొప్ప ఫినీషర్ అంటూ మరోసారి రుజువు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో ధోనీపై క్రీడా, రాజకీయ, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ధోని ఆట తీరుపై ప్రశంసలు కుపించారు.
అయితే తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ధోనీపై ఊహించని రీతిలో అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. MAHI-NDRA లో MAHI అనే అక్షరాలను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇక దీంతో పాటు ధోనీ అద్భుతమైన ముగింపుతో జట్టును గెలపించాడంటూ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్టర్ లో తెలిపాడు.
ఇది కూడా చదవండి: ధోనిపై మంత్రి KTR ప్రశంసలు.. ట్వీట్ వైరల్!
కాగా గురువారం ముంబైతో చెన్నై టీమ్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివరిలో గెలుపు ముంబై దే అని అందరూ అనుకుంటుండగా ధోనీ తన ఆటతీరుతో అద్భుతంగా ఫీనిష్ చేసి చెన్నైని గెలిపించారు. మహేంద్ర సింగ్ ధోనీపై ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Well, all I can say is that I’m glad we have the letters MAHI in Mahi-ndra! 💪🏽😃 #MSDhoni Awesome finish. https://t.co/FNv6u89zRA
— anand mahindra (@anandmahindra) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.