భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అదే సమయంలో మరోవైపు ఆసియా క్రీడలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టోర్నమెంట్ లు ఆడడం కష్టంగా మారింది. అయితే ఈ క్రీడల కోసం బీసీసీఐ ఒక ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసింది.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న ఈ టోర్నీకి చైనా ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీం ఆడకపోయినా.. టీ 20 ఫార్మాట్ లో క్రికెట్ కూడా నిర్వహిస్తుంది. ఇంతకుముందు కూడా ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు జరిగాయి. కానీ బీసీసీఐ ఈ క్రీడలపై అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సారి మన భారత క్రికెట్ జట్టుని కూడా ఈ టోర్నీకి పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. అదే జరిగితే టీమిండియాకు ధావన్ ని కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉంది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అదే సమయంలో మరోవైపు ఆసియా క్రీడలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టోర్నమెంట్ లు ఆడడం కష్టంగా మారింది. అయితే ఈ క్రీడల కోసం బీసీసీఐ ఒక ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసింది. అందుకే ఈ క్రీడలు ఆడేందుకు భారత్-బి జట్టుని ధావన్ నేతృత్వంలో చైనాకి పంపనున్నారని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. ఇదే జరిగితూ రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్లకి ఇదొక సువర్ణావకాశం. తమను తాము నిరూపించుకొని టీమిండియాలోకి అడుగుపెట్టడానికి ఒక మార్గం దొరికినట్టే. అంతేకాదు టీమిండియాలోకి సెలక్ట్ కానీ ధావన్ కి ఇదొక గొప్ప గౌరవంగా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందంట. ఆసియా క్రీడల్లో కనుక స్వర్ణం సాధిస్తే ధవన్ కెరీర్లో కూడా అరుదైన ఘనత చేరుతుందని నిపుణుల అభిప్రాయం.
ఈ సారి భారత పురుషుల బి-టీంతోపాటు మహిళల జట్టును కూడా పంపాలని బీసీసీఐ డిసైడ్ అయిందట. మహిళల జట్టుకు కీలకమైన టోర్నీలేవీ ఈ సమయంలో లేవు. దీంతో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళల జట్టు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయింది. ఎప్పుడు లేనిదీ ఈ సారి భారత్ క్రికెట్ టీంని ఆసియా క్రీడలకు పంపితే ఓ వైపు వరల్డ్ కప్, మరో వైపు ఆసియా క్రీడలు రెండు కూడా అభిమానులకి ఫుల్ కిక్ఇవ్వడం గ్యారంటీ. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.