ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ధావన్ కి ఆసియా గేమ్స్ లో అవకాశం వస్తుందని భావించినా అలా జరగలేదు. తాజాగా ఈ విషయంపై ధావన్ స్పందించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధవన్ గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధవన్..అప్పటి నుంచి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా సమాచార ప్రకారం ధవన్ టీమిండియాలోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అదే సమయంలో మరోవైపు ఆసియా క్రీడలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టోర్నమెంట్ లు ఆడడం కష్టంగా మారింది. అయితే ఈ క్రీడల కోసం బీసీసీఐ ఒక ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసింది.