యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల మ్యాచ్ కూడా ముగిసింది. అంతా ఊహించినట్లుగానే టీమిండియా పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక మ్యాచ్ లో వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇక భారత్ – పాక్ మ్యాచ్ విషయానికి వస్తే ఎలాంటి భారీ స్కోర్లూ లేవు.. సిక్సర్ల మెరుపులూ లేవు.. కానీ మ్యాచ్ చూసినంత సేపు మాత్రం అభిమానులకు గుండె ఆగినంత పని మాత్రం అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆట చివరి ఓవరు దాకా రావడమే దానికి కారణం. ఐతే ఇండియా బ్యాటర్లు మాత్రం చివర్లో ఒత్తిడిని జయించి భారత్ కు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను వెనక్కి నెట్టాడు. రోహిత్ 11 రన్స్ వద్ద ఈ ఘనత సాధించాడు. రోహిత్ 3499 రన్స్ తో అగ్రస్థానంలో దూసుకెళ్లాడు. ఇక రోహిత్ 133 మ్యాచ్ ల్లో 32.10 యావరేజ్ తో ఈ రన్స్ చేయడం విశేషం.
ఇక గప్టిల్ 3497 పరుగులతో రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 3341 రన్స్ తో మూడో ప్లేస్ లో ఉండగా.. ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ 3011 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.