శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో సహచర ఆటగాడైన వాషింగ్టన్ సుందర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవనివి…. (G**nd Mara Rahe Ho Udhar) అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. హార్దిక్ వాడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా గానీ.. పది మందిలో ఉన్నప్పుడు సహనంతో మెలగాలి. అందులోనూ సహనానికి మారు పేరు భారతీయులు అన్న గుర్తింపు ఉంది. అయితే పాండ్యా తోటి ఆటగాడు అయిన వాషింగ్టన్ సుందర్ పై పరుష పదజాలంతో దూషించడం విమర్శలకు దారి తీసింది. కెప్టెన్, వైస్ కెప్టెన్గా పాండ్యాకు ప్రమోషన్ రావడంతో బలుపు ఎక్కువైందని నెటిజన్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లోనూ ఇలానే వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఆటగాడు కెప్టెన్ గా కొనసాగితే దేశం పరువు గంగలో కలిసిపోతుందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
ఇన్నాళ్లు సహనానికి మరు పేరు భారతీయులు అన్న గుర్తింపు పోయే ప్రమాదం ఉందని నెటిజన్స్ దుయ్యబడుతున్నారు. ఒక సచిన్ టెండూల్కర్, ఒక ఎం.ఎస్. ధోనీ లాంటి వాళ్ళు కూడా జట్టు కెప్టెన్ గా ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఏనాడూ తమ సహనాన్ని కోల్పోలేదు. అగ్రెసివ్ నెస్ అనేది ఆడే ఆటలో చూపించాలి గానీ.. తోటి ఆటగాళ్లపై కాదని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా హార్దిక్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, ఎంత పెద్ద ఆటగాడైన కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదని సూచిస్తున్నారు. మరి హార్దిక్ పాండ్యా.. ఇలా వాషింగ్టన్ సుందర్ ని పరుష పదజాలంతో దూషించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Ye hardik itna attitude lata kaha se hai?
Is this the way to talk? pic.twitter.com/ON96D8OHXT— Ansh Shah (@asmemesss) January 12, 2023