ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు దంచి కొడుతున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో ఇండియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. అది నుంచే కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి రోహిత్- గిల్ జోడీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో రోహిత్ సెంచరీ((100) పూర్తి చేసుకోగా, 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో గిల్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. వీరిద్దరి ధాటికి ఇండియా వికెట్ నష్టపోకుండా 26 ఓవర్లలో 212 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాటర్లు ఎడా.. పెడా బడటం మొదలుపెట్టేశారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడం, బౌండరీలు చిన్నగా ఉండడంతో ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసిన రోహిత్- గిల్ జోడి ఆ తరువాత మరింత రెచ్చిపోయారు. వీరి ధాటికి కివీస్ బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించారనే చెప్పాలి. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలతో కదం తొక్కారు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన గిల్ మరో సెంచరీతో చెలరేగగా, గత మూడేళ్ళుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్నా హిట్ మ్యాన్.. ఆ కరువును జయించాడు.
𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬! 🔥
Talk about leading from the front! 🙌🏻
A magnificent century from #TeamIndia captain @ImRo45 💯
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/iR3IJH3TdB
— BCCI (@BCCI) January 24, 2023
కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతకం బాదగా, శుభ్మన్ గిల్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ వికెట్ నష్టపోకుండా 26 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 400 ప్లస్ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. కాగా, భారత్.. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
CENTURY number 4️⃣ in ODI cricket for @ShubmanGill!
The #TeamIndia opener is in supreme form with the bat 👌👌
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/OhUp42xhIH
— BCCI (@BCCI) January 24, 2023