IPL పుణ్యమాని.. భారతదేశంలో ఉన్న నైపుణ్యం గల యువ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. అయితే వారికి టీమిండియాలో చోటు దక్కించుకోవడం మాత్రం గగనంగా మారింది. దానికి సైతం కారణాలు లేకపోలేదు. కుప్పలు తెప్పలుగా అద్భుతమైన ఆటగాళ్లు టీమ్ లో ఉండటంతో.. ఎవరిని సెలక్ట్ చేయాలో సెలక్టర్లకు సైతం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే కొంత మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ బాహటంగానే తమ బాధను వెళ్లగక్కుతున్నారు. దేశవాలీ క్రికెట్ లీగుల్లో రాణిస్తున్నప్పటికీ మాకు జాతీయ జట్టులో ఎందుకు స్థానం ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా నన్ను జట్టులోకి తీసుకునే ముందు టీ20 వరల్డ్ కప్ ఆడిస్తాం అని చెప్పి.. ఆడించ కుండా మోసం చేశారని టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
వెంకటేష్ అయ్యర్.. 27 సంవత్సరాల ఈ యువ కెరటం దేశవాలీ ట్రోఫీల్లో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్ రౌండర్ ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 62 పరుగులతో నాటౌట్ గా ఉండటమే కాకుండా బౌలింగ్ లో సత్తా చాలా 6 వికెట్లు పడగొట్టాడు వెంకటేష్ అయ్యర్. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న క్రమంలోనే అతడి కాలికి గాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించాడు వెంకటేష్ అయ్యర్. తనను జట్టులోకి తీసుకునే ముందే.. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో ఆడిస్తామని చెప్పారని, కానీ వరల్డ్ కప్ లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వెంకటేష్ అయ్యర్.
ఇక ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను అని వెంకటేష్ అయ్యర్ తెలిపాడు. నన్ను నమ్మించి మోసం చేశారని, ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అయ్యర్ సెలక్షన్ కమిటీని ప్రశ్నించాడు. ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో బీసీసీఐ మీద తెగ విమర్శలు వస్తున్నాయి. జట్టు ఎంపిక సరిగ్గా చేయకనే టీ20 వరల్డ్ కప్ లో ఓటమి చెందామని, పైగా టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ లు ఇవ్వడంలేదన్నది సెలక్షన్ కమిటీ పై వస్తున్న ప్రధాన ఆరోపణ. సంజు శాంసన్ సైతం ఒక్క ఛాన్స్ అంటూ.. బీసీసీఐ వైపు ఎదురుచూస్తున్నాడు.
.@venkateshiyer opens up on his T20 World Cup exclusion.#VenkateshIyer #T20WorldCup #IndianCricketTeam #Cricket #CricTracker pic.twitter.com/fNUaK44gz2
— CricTracker (@Cricketracker) November 23, 2022