ఏదైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అంటే చాలు.. ఆ జట్ల మధ్య సహజంగానే మాటల యుద్ధం మెుదలౌతుంది. ప్రత్యర్థిని తన మాటలతో మానసికంగా కుంగదీయాలనేది వారి ఎత్తుగడ. అలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని లేకుండా చేయడమే కొన్ని జట్లు తమ స్ట్రాటజీగా చెప్పుకుంటాయి. ఇలా మాటల యుద్ధాలకు దిగటంలో ఆస్ట్రేలియా తర్వాతే ఎవరైనా. ఆసిస్ జట్టు ముందుగా తన దాడిని మాటలతోనే మెుదలు పెడుతుంది. 3 టీ20 మ్యాచ్ ల కోసం ఆసిస్ భారత పర్యటనలోకి దిగింది. ఈ క్రమంలోనే ఆసిస్ స్టార్ బౌలర్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. వేస్తే ఘోరంగా దెబ్బతినడం ఖాయం అంటున్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మెుహాలీ వేదికగా సెప్టెంబర్ 20 మంగళవారం నాడు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇండియాలో అడుగుపెట్టిన ఆసిస్ టీమ్ తన నోటికి పని చెప్పింది. మెుదటి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆసిస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సమావేశం ద్వారా అతడు డైరెక్ట్ గా టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇరు జట్ల గురించి మాట్లాడుతూ..” గాయాల కారణంగా మా జట్టు స్టార్ ఆటగాళ్లను కోల్పోయినప్పటికీ.. మేం బలహీనులం కాలేదు. మీరు మమ్మల్ని బలహీనుల కింద లెక్కేసి.. మమ్మల్ని లైట్ తీసుకుంటే మాత్రం మీకు పరాభవం తప్పదు. అదీ కాక మేం ఇక్కడికి సిరీస్ ను గెలిచేందుకే ఇక్కడికి వచ్చాం” అని పేర్కొన్నాడు.
మరిన్ని విషయాల గురించి కమ్మిన్స్ మాట్లాడుతూ.. “ఇక మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు దూరం కావడం మాకు మైనస్సే.. దానిని మేం అంగీకరిస్తాం. ప్రస్తుతానికి అయితే మా జట్టు బలంగానే ఉంది. అందరు టీ20 ల్లో ఆడిన అనుభవం ఉన్నవాళ్లే కావడం మాకు సానుకూలాంశంగా మేము భావిస్తున్నాం” అని పేర్కొన్నాడు. ఇక భారత జట్టు విషయానికి వస్తే టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా జట్టులోకి వచ్చాడు. అలాగే యువ ఆటగాడు హర్షల్ పటేల్ సైతం బరిలోకి దిగుతున్నాడు. ఈ సిరీస్ ను గెలవడం ద్వారా రాబోయే టీ20 ప్రపంచ కప్ కు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని టీమిండియా చూస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్యాట్ కమ్మిన్స్ భారత్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి ప్యాట్ కమ్మిన్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.