టీమిండియా మరో యుద్ధానికి సిద్ధమైంది. ఆసియా కప్ 2022లో సూపర్-4 లోనే ఇంటిదారి పట్టిన భారత్.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు మంచి ప్రాక్టీస్ లభించింది. రేపటి నుంచి ఆస్ట్రేలియాతో 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. మెుదటి మ్యాచ్ మెుహాలి వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 20)న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లు అధికారికంగా ఉన్న బ్రాడ్ కాస్టర్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ లలో ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలోనే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లను మీరు ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ మ్యాచ్ లను మనం టీవీలో చూడాలి అంటే ఆ ఛానల్స్ ను మనం ముందుగా సబ్ స్క్రైబ్ చేసుకుని లేదా రిఛార్జ్ చేసుకుని ఉండాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ లను కొన్ని బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ టెండర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ముందుకు వస్తాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు మ్యాచ్ చూడాలి అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత డబ్బులు పెట్టే ఆర్థిక స్థోమత సగటు క్రికెట్ అభిమానికి ఉండక పోవచ్చు. వారి బాధలను గ్రహించిన కొన్ని టెలికామ్ సంస్థలు క్రికెట్ అభిమానులకు రీఛార్జ్ లపై పలు రకాల ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. దాంతో రేపటి నుంచి జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లను మీరు ఈ విధంగా చూడవచ్చు. అవి:
1. మెుబైల్ రీఛార్జ్ ప్లాన్స్ తో
ఈ పోటీ ప్రపంచంలోనే టెలికాం సంస్థలు వినియోగదారులకు చాలా ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో, ఎయిర్ టెల్, VI లాంటి దిగ్గజ సంస్థలు యూజర్లకు చాలా ప్లాన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మనం మాములుగా చేసుకునే రీఛార్జ్ తోనే హాట్ స్టార్ సబ్ స్క్రీప్షన్ తీసుకోవచ్చు. కాక పోతే దానికి మరీ ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ రీఛార్జ్ కు కొద్ది మెుత్తం అదనంగా చెల్లిస్తే చాలు.. మీరు ఈ మ్యాచ్ లను సదరు ఛానల్స్ లల్లో చూడవచ్చు.
2.జియో టీవీ..
యుజర్లకు ఎప్పటికప్పుడు ఆఫర్లను అందించడంలో జియో ఎప్పుడూ ముందే ఉంటుంది. అందులో భాగంగానే జియో టీవీ యాప్ లో కూడా ఈ మ్యాచ్ లను వీక్షించవచ్చు. జియో టీవీ యాప్ లో స్టార్ స్పోర్ట్స్ అని సెర్చ్ చేస్తే అక్కడ మ్యాచ్ చూసే ఆప్షన్ ను చూపిస్తుంది. కానీ ఇది జియో టీవీ యూజర్లకు మాత్రమే అని తెలిపింది.
3.దూరదర్శన్ లో..
భారతదేశంలో అతి పురాతనమైన క్రీడా ప్రసార ఛానల్ గా దురదర్శన్ కు గుర్తింపు ఉంది. కాక పోతే ఈ కార్పోరేట్ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం వెనకబడింది అనే చెప్పాలి. దురదర్శన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే డీడీ స్పోర్ట్స్ లో మాత్రం ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే మ్యాచ్ లను చూసే వీలుంది.
ఇక జట్ల వివరాలల్లోకి వస్తే.. కింగ్ కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియాకు మంచి పరిణామం. అయినప్పటికీ భారత జట్టులో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని సవరించుకుని బరిలోకి దిగితేనే టీమిండియా ఆస్ట్రేలియాను ఎదుర్కొనగలదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీద గెలించి ఉత్సాహంగా ఉంది. అదే జోరును భారత్ పై కూడా చూపించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ పై మాటల దాడిని కూడ ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టును మాటలతో మానసికంగా దెబ్బకొట్టడంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ముందే ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. రెండు సమఉజ్జిల మధ్య పోరు ఎలా ఉండబోతుందో మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. మరి మ్యాచ్ ను ఉచితంగా చూసేందుకు సంస్థలు కల్పిస్తున్న ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.