కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. కాగా, బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటితో ముగియనున్నాయి. ఈసారి భారత్ పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.
కామన్వెల్త్ గేమ్స్ లో ఆదివారం జరిగిన స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలి గేమ్ను 11-8తో పల్లికల్, రెండో గేమ్ను 11-4తో గెలుచుకున్నారు. తద్వారా భారత్ ఖాతాలో 50వ పతకం చేరింది.
దీపికా పల్లికల్ని దినేశ్ కార్తీక్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేరు పెట్టారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#CommonwealthGames2022 | India’s Saurav Ghosal & Dipika Pallikal win a bronze medal in mixed doubles squash
— ANI (@ANI) August 7, 2022