క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన ఆటతోనే కాకుండా.. వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా కొంతమంది వార్తల్లో నిలుస్తారు. ఈ కోవలో పాక్ ఆటగాళ్ల జాబితా పెద్దదే. టీమిండియా ఆటగాళ్లపై కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఈ లిస్ట్లో ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా చేరిపోయాడు. టీమిండియా టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభ్యంతరకర కామెంట్లు చేశాడు. విరాట్ కోహ్లీ అనవసరపు వివాదాలను రెచ్చగొట్టే బదులు.. తన ఆటపై దృష్టి పెట్టాలని నీతులు చెప్పాడు.
వన్డే కెప్టెన్గా విరాట్ కోహ్లీని బీసీసీఐ తప్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్.. తనతో సరైన చర్చలు జరపకుండానే కెప్టెన్సీ మార్పు విషయం తనతో చెప్పారని పేర్కొన్నాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించేందుకు నిరాకరించాడు. దీంతో కనేరియా ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది. కానీ కనేరియా వ్యాఖ్యలపై మాత్రం కోహ్లీ ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. కోహ్లీకి నీతులు చెప్పేంత సీన్ కనేరియాకు లేదని మండిపడుతున్నారు. ప్రపంచ టాప్ బ్యాట్స్మెన్కు తన ఆటపై ఎలా దృష్టి పెట్టాలో తెలుసని.. అది కనేరియా చెప్పాల్సిన అవసరం లేదని చురకలు అంటిస్తున్నారు.
టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్లో మునిగిపోయి ఉంది. కోహ్లీ, ఆటగాళ్లతో, కోచ్తో ఎంత క్లోజ్గా ఉన్న విషయం బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేస్తున్న వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. మరి కోహ్లీ వివాదాలను రెచ్చగొడుతున్నాడు.. అంటూ కనేరియా కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని క్రికెట్ నిపుణులు వాపోతున్నారు. మరి కనేరియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాహుల్ ద్రావిడ్ ప్లేస్పై గురిపెట్టిన విరాట్ కోహ్లీ
𝗜𝗔𝗡𝗦 𝗘𝘅𝗰𝗹𝘂𝘀𝗶𝘃𝗲#ViratKohli (@imVkohli) needs to focus on his game, rather than inciting controversies: #DanishKaneria
Read: https://t.co/Y1GYgnJchY
Photo: @DanishKaneria61 pic.twitter.com/TYnubmnJFC
— IANS Tweets (@ians_india) December 23, 2021