మరికొద్ది రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. దీంతో అన్ని జట్లు తమ తమ బలా బలాలను అంచాన వేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇక మరి కొంత మంది మాజీలు, ప్రత్యర్థి ఆటగాళ్లు తమకు నచ్చినట్లు జోస్యం చెప్పుకుంటూ అవతలి వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్ కోహ్లీకి కొందరు మద్దతు పలుకుతూ ధైర్యం చెబుతుంటే మరి కొందరేమో అతన్ని రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కోహ్లీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళెతే..
విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ రన్ మిషన్.. ఇది ఒకప్పటి మాట. గత మూడు సంవత్సరాలుగా ఈ రన్ మిషన్ పరుగులు రాబట్టడంలో విఫలమవుతు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విరాట్ శతకం బాది మూడు ఏళ్లు అవుతోంది అంటేనే అర్ధం చేసుకోవచ్చు అతడు ఎంతలా ఫామ్ కోల్పోయాడో. దాంతో ప్రస్తుతం జింబాబ్వే సిరీస్ నుంచి విరాట్ కు విశ్రాంతి ఇచ్చారు. ఇక రాబోయే ఆసియా కప్ కు పూర్తిగా సిద్దం అవుతున్నాడు విరాట్.
ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత ఆకాశ్ చోప్రా విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందించాడు. ” విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాటర్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి అతడు క్రియేట్ చేసిన రికార్డులే నిదర్శనం. ప్రస్తుతం అతడు ఇక క్రికెట్ లో ఒక పరుగు చేయక పోయినా.. అతడు ఓ గొప్ప ఆటగాడిగానే నిలుస్తాడు. కానీ ప్రస్తుతం అతని బ్యాట్ రన్స్ ను రాబట్టలేక పోతుంది. దీంతో విరాట్ ను చూస్తే పాకిస్తాన్ బౌలర్లకే కాదు మిగతా టీం బౌలర్లకు కూడా ఒకప్పటిలా భయం లేదు.” అంటూ చెప్పుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా విరాట్ ఫామ్ పై మాజీలు అలాగే విదేశీ ఆటగాళ్లు సైతం విమర్శలు, మద్దతు తెలపడం మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి విరాట్ తిరిగి ఫామ్ లోకి రావాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఇక విరాట్ పై చోప్రా చేసిన వ్యాఖ్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@cricketaakash backs the current set-up of the Indian team to bring the best out of Virat Kohli ✍
Full article 👉 https://t.co/7T067INcjY pic.twitter.com/rM4CMmBEkf
— ESPNcricinfo (@ESPNcricinfo) August 24, 2022