17 సంవత్సరాల తర్వాత టెస్టు క్రికెట్ ఆడటానికి ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ లోపర్యటిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ఇప్పటికే పాక్ లో దిగింది బ్రిటీష్ జట్టు. టీ20 వరల్డ్ కప్ కు ముందే పాక్ లో 7 టీ20 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ మరోసారి టెర్రరిస్టుల గడ్డ పాక్ లో అడుగుపెట్టింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇంగ్లీష్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే తొలి టెస్టు మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. గురువారం (డిసెంబర్ 1)న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టులోని 12 మంది ఆటగాళ్లు అంతుచిక్కని వైరస్ బారిన పడ్డట్లు క్రీడా వర్గాలు తెలిపాయి.
మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్ టీమ్. భద్రతాలోపాల దృష్ట్యా కేవలం 15 మందితోనే పాక్ లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే మరో 24 గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న సమయంలోనే ఇంగ్లాండ్ జట్టులోని 12 మంది ప్లేయర్లకు వైరస్ సోకినట్లు స్పోర్ట్స్ వర్గాలు తెలిపాయి. వారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారికి వచ్చిన ఇన్ ఫెక్షన్ లక్షణాలు కోవిడ్ వైరస్ కు సంబంధించినవి కాదని అక్కడి వైద్యులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న సందేహం నెలకొంది.
అయితే పాక్ లో ఫుడ్ మాకు నచ్చడంలేదని ఇంగ్లాండ్ నుంచే వంట మనిషిని తెచ్చుకుంటున్నాం అని ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 12 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడటం ఏంటని ప్రపంచ దేశాల క్రీడాకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ బారిన పడ్డ ప్లేయర్లకు చికిత్స అందిస్తున్నట్లు పాక్ వర్గాలు తెలిపాయి.
NEWS ALERT: At least 12 members of the England Team including captain Ben Stokes have been infected by a virus (no COVID symptoms) ahead of the first Test against Pakistan.#PAKvENG
— CricTracker (@Cricketracker) November 30, 2022