తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల అకాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ లో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. నిజానికి శుక్రవారం జరిగిన ఆమండలి సమావేశానికి కూడా మహ్మద్ కరీమున్నీసా హాజరయ్యారు. ఇంత ఆరోగ్యంగా ఉన్న ఆమెకి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారు.
కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహ్మద్ కరీమున్నీసా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ గూటికి చేరిన మహ్మద్ కరీమున్నీసాకి పార్టీ విధేయురాలిగా పేరుంది. ఈ క్రమశిక్షణ కారణంగానే కరీమున్నీసాకి గత ఏడాది ఎమ్మెల్సీగా సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఇక మున్నీసా మృతిపట్ల వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు.
నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2021