ఏపీ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమం లో ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా తిరువూరు మండలం రాజవరం గ్రామంలో యన్టీఆర్ వర్ధంతి నాడు ఇరు పార్టీల వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి నూజివీడు సబ్ జైలుకు తరలించారు.
నూజివీడు సబ్ జైలులో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించేoదుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళ్లారు. ఆయనతో పాటు తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ..” వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అప్పుడు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తగిన బుద్ధి చెబుతాం. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు అరెస్టులు చేసే కొద్దీ కార్యకర్తలు, టిడిపి నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి శూన్యం. అక్రమ అరెస్టు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అంటూ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి..ఎంపీ కేశినేని మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.