జగన్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ కాల్ చేశారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకొచ్చారు. జగన్ ఫోన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారో వెల్లడించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలు, అధికార పార్టీ నేతలు ఏకమవుతారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలను తప్పుబట్టడమే ప్రతిపక్షం పని కాకుండా.. మంచి చేస్తే సమర్ధించే పార్టీ నేతలు కూడా ఉన్నారు. అలానే తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరినొకరు ఆహ్వానించుకుంటారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా గానీ సందర్భం వచ్చినప్పుడు ఆత్మీయుల్లా కలిసిపోతారు. పవన్ కళ్యాణ్, జగన్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇదే జరిగింది. పవన్ అంటే జగన్ కి ఎంత గౌరవమో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.
2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కి కాల్ చేశారట. ప్రమాణ స్వీకారానికి తనకు కాల్ చేసి ఆహ్వానించారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఇన్ని రోజులూ ఒకరి మీద ఒకరం పోరాడుకున్నాం.. అలాంటిది ప్రమాణ స్వీకారానికి వస్తే మీకూ బాగుండదు, నాకూ బాగుండదు, మా జన సైనికులకు బాగుండదు, మా వీర మహిళలకు బాగుండదు అని చెప్పానని అన్నారు. ప్రజలు మీకు బలమైన మద్దతు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు.. అందుకు నేను వంద శాతం మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించనని, ప్రజా సమస్యలపైనే మాట్లాడతానని ఆరోజే జగన్ కి చెప్పానని అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ పట్ల జగన్ కి ఎంత గౌరవం ఉందో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా 2019లో జరిగిన సంఘటనను వారాహి విజయ యాత్రలో భాగంగా పంచుకున్నారు. మరి జగన్ తనకు కాల్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.