తారక్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీడీపీ నాయకుల సైతం ఎన్టీఆర్ రాక కోసం ఎదరు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఆపార్టీ కార్యకర్తల్లో ఉంది. అయితే, తారక్ ఎప్పుడూ రాజకీయాలపై ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఆయన అభిమానులు మాత్రం బలంగా కోరుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాఖా కుప్పంలో వెలిసిన ఎన్టీఆర్ జెండా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దివంగత మహానేత ఎన్టీ రామారావు మనవడిగా సినీ ఇండస్ట్రీలో అంచెంచెలుగా ఎదుగుతున్నారు. తన వాగ్ధాటితో ఎంతటివారినైనా ఆకట్టుకునే తత్వం ఎన్టీఆర్ సొంతం. 2009 ఎన్నికలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తన స్పీచ్లతో యువతను ఉర్రూతలూగించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ఏపీ తర్వాతి సీఎం ఎన్టీఆర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ తరుణంలోనే కుప్పంలో అభిమానులు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశాన్ని ఆకాంక్షిస్తూ జెండా ఆవిష్కరించి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, చంద్రబాబు మాత్రం తన కుమారుడు లోకేశ్ను ప్రమోట్ చేయడంపైనే దృష్టి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తారక్ పేరుతో జెండా వెలువడం చంద్రబాబును ఇబ్బందికి గురిచేస్తోందని భోగట్టా.