టోక్యో ఒలంపిక్స్లో మహిళల హాకీ టీమ్ తీవ్రంగా శ్రమంచి కాంస్య పతకం వరకు వెళ్లి చివరకు ఓటమి పాలైంది. ఈ టీమ్ ఓడిపోయిన భారతీయుల మనసులు మాత్రం గెలుచుకున్నారు. చివరికి కాంస్య పతకం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మన మహిళల హాకీ టీమ్ కొద్ది స్కోర్తో పోరాడి ఓడారు. దీంతో ఈ హాకీ టీమ్లో గోల్ కీపర్గా ఉత్తమ ప్రతిభ కనబరిచింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంకు చెందిన రజనీ అనే క్రీడాకారిణి.
ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్లోనే కాకుండా గతంలో జరిగిన రీయో ఒలంపిక్స్లోనూ తన సత్తాను చాటి చూపించింది. ఈ నేపథ్యంలో నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో తన తల్లిదండ్రులతో మర్యాదపూర్వకంగా కలిసింది రజనీ. ఈ సందర్భంగా సీఎం రజనీని శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. దీంతో పాటు రజినీకి కొన్ని ప్రోత్సహకాలు కూడా ప్రకటించారు సీఎం జగన్. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇక ఇదే కాకుండా తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్లు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇక టోక్యో ఒలంపిక్స్లో దక్షిణాది నుంచి పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా రజనీ పాల్గొనటం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ అధికారులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.