ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సమ్మర్ ను మించి హాట్ హాట్ గా ఉన్నాయి. నిత్యం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత నుంచి ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కాస్తా నిదానంగా సాగిన టీడీపీ.. తరువాత మాత్రం దూకుడు పెంచింది. టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సమ్మర్ ను మించి హాట్ హాట్ గా ఉన్నాయి. నిత్యం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత నుంచి ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కాస్తా నిదానంగా సాగిన టీడీపీ.. తరువాత మాత్రం దూకుడు పెంచింది. ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో అధికార వైసీపీపై విమర్శల చేస్తున్నారు. వారికి ధీటుగా వైసీపీ నాయకులు కూడా సమాధానాలు చెప్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి అనంతపురంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు హిందూపురంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.ఈ నేపథ్యంలో లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో డ్రగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు. టీడీపీ హయంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇంతవరకు ప్రజలకు ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చిన మీరు తీసుకోవద్దని ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు.
మెయింటనెన్స్ లేక ఇళ్లు పాడయ్యాయని, టిడ్కో ఇళ్లు కూలిపోయి జనాలు చనిపోతారంటూ బాలయ్య హట్ కామెంట్స్ చేశారు. జగన్ కి జనాలపై ఉంది ప్రేమ కాదని, జనం అంటే జగన్ కి కక్ష అని.. అదోరకమైన సైకోతత్వమని ఆయన అన్నారు. తాను సైకాలజీ చదవలేదు కానీ.. తనకు బాగా తెలుసని, తాను సైకాలజిస్ట్ నని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పాలన చేతకాదని, సలహాదారుల సలహాలు తీసుకోరని, ఆయన సలహాదారులంతా ఓ వర్గానికి చెందినోళ్లో ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరి.. వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.