టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహాబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు
టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. టీడీపీ నుండి 1994, 1999లో అమరచింత నియోజకవర్గం (ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం) నుండి పోటీ చేసి గెలుపొందారు. 2009లో మక్తల్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.
ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. కోలుకుని స్వగ్రామానికి వెళ్లారు. తిరిగి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో టీడీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తెలంగాణ టీడీపీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి వ్యహరించారు. అయితే తెలంగాణలో పార్టీ బలోపేతం నానాటికి తగ్గిపోవడంతో దయాకర్ రెడ్డి, ఆయన భార్య పార్టీ నుండి వీడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుండి వీడిపోవాల్సి వస్తుందంటూ గత ఏడాది పార్టీని వీడిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు దయాకర్ రెడ్డి. దయాకర్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.