గతంలో టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీ మారీ అదే పార్టీకి ప్రధాన శత్రువుగా మారిపోయారు. టీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాల ఆరోపణలతో ఈటలను పార్టీ నుంచి బయటకు పంపిన విషయం తెలిసిందే. దీంతో అనంతరం మారిన రాజకీయ పరిణామాల మధ్య ఈటల రాజేందర్ కమలం గూటికి చేరి రాజీనామా చేసిన చోటే గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో అప్పటి నుంచి ఈటలకు, కేసీఆర్ కు అస్సలు పడడం లేదు. వీరిద్దరి మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.
ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజుల కిందట ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు సైతం స్పందించి ఈటలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈటల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ను మొన్న గెలిపించిన గజ్వేలు ప్రజలు, వచ్చే ఎన్నికల్లో ఓడించేది కూడా గజ్వేల్ ప్రజలేనని అన్నారు.
ఇది కూడా చదవండి: Eetala Rajendar: గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల పోటీ.. బెంగాల్ సీన్ రిపీట్ చేస్తానంటూ!
ఇక కేసీఆర్ సవాల్ చేయడం కాదని, దమ్ముంటే ముందు అసెంబ్లీ రద్దు చేయాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. మాట్లాడితే మోకాళ్ల హైట్ ఉన్నాడని అంటున్నాడు, నేను ఎంత ఎత్తు ఉన్నానో పక్కన పెడితే.. బుల్లెట్ కూడా అర ఇంచే ఉంటుంది.. కానీ అది గుండెల్లో దిగితే తెలుస్తుంది ఎలా ఉంటుందో అంటూ ఈటల రాజేందర్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై ఈటల చేసిన ఈ సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.