గోదావరి జిల్లాలలో ప్రతీకార రాజకీయాలకి తావు లేదు. కానీ.., ఇది నిన్నటి మాట. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం వర్గ పోరుతో భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు నెలకొన్నాయి.
గత కొన్ని నెలలుగా ఈ వర్గ పోరు ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రగులుతున్న దెందులూరులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ యాంకర్ జాఫర్ ఆ ఊరిలో అడుగు పెట్టారు. ఇద్దరు నేతలను “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” కార్యక్రమానికి ఆహ్వానించి అక్కడి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., ఈ ప్రోమో పై మీరు కూడా ఒక లుక్ వేసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.