తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భగవద్గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గపూరి వాహనాల్లో భగవద్గీత పెడితే దాడులు చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఉదయం లేస్తే ప్రశాంతత కోసం భగవద్గీత పెడతారు. ఇవాళ భగవద్గీత వింటే టెన్షన్ వస్తుంది. ఎవరు ఎక్కడ చనిపోయరా అనిపిస్తుంది. ఎవడో ఒకడు మూర్ఖుడు చనిపోయినప్పుడు భగవద్గీత పెడితే..దాని ఫ్యాషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు చచ్చిపోతే భగవద్గీత పెడుతున్నారు. ఇప్పుడు భగవద్గీత వైకుంఠధామలకే పరిమితమైంది. కరీంనగర్ లో అలా పెడితే టైర్లు కోసి పడేస్తానని హెచ్చరించాము. దీంతో అక్కడ స్వర్గపురి వాహనాల మీద భగవద్గీత పెడ్డటం ఆపేశారని బండి సంజయ్ తెలిపారు. ఇక నుంచి స్వర్గపురి వాహనాల్లో, వైకుంఠధామాల్లో భగవద్గీత పెడితే దాడులు చేస్తామని తెలిపారు. అర్చకులు కూడా భగవద్గీతను ఎక్కడ ఉపయోగించాలో అందరికి చెప్పాలని తెలిపారు. మీరు చెప్తే తులసీ తీర్దం అవుతుంది, అదే తాము చేప్తే రాజకీయం అవుతుంది అని అర్చకులను ఉద్దేశించి బండి సంజయ్ అన్నారు.