సాధారణంగా ఎవరికైన హఠాత్తుగా బోలెడంత బంగారం దొరికితే ఏం చేస్తారు? ఠక్కున దాచేస్తారా.. లేదా ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని భద్రంగా వారి అప్పగిస్తారా? ఆ నిర్ణయం అనేది బుద్ధిని బట్టి ఉంటుంది. తాజాగా ఓ రైల్వే గార్డు చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. ఓ రైల్వే ప్రయాణికుడు పొగొట్టుకున్న లక్షల విలువైన బంగారం ఉన్న సూట్ కేసు ఆ గార్డుకు దొరికింది. కేవలం గంటల వ్యవధిలోనే యజమాని గుర్తించి సొమ్ము అప్పగించాడు. వెయ్యి రూపాయల దొరికిన ఎవరికి తెలియకుండా జేబుల్లో పెట్టుకునే వాళ్లు ఉన్న ఈ కాలంలో ఇలాంటి ఈ వ్యక్తి ..గ్రేట్ అంటూ అందరి ప్రశంసించారు.
రైల్వే అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు వెళ్తేందుకు రమేష్ చంద్ అనే వ్యక్తి, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం (ఏప్రిల్ 5) రాత్రి 9.30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అయితే అతనితో పాటు కొన్ని బ్యాగులు కూడా ఉన్నాయి. స్టేషన్ కి చేరుకునే క్రమంలో ఓ సూట్ కేసు మిస్సైంది. కొద్ది సమయం తరువాత ఒక సూట్ కేస్ కనిపించట్లేదని రమేష్ గ్రహించాడు. పోగొట్టుకున్న సూట్ కేస్లో దాదాపు రూ. 20 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.
వెంటనే బెంగళూరులోని అక్కడే రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివన్న కేసు ఫైల్ చేసి ఇతర పోలీసులకు హుటాహుటిన సమాచారం అందించాడు. అదే స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న గురురాజ్కు సూట్ కేసు దొరకడంతో, గంటల వ్యవధిలోనే దాన్ని యజమానికి అందజేశారు. దీంతో సదరు హోంగార్డును రైల్వే పోలీసులు, అతని సీనియర్లు ప్రశంసించారు. రమేష్ చంద్ సదరు హోం గార్డుకు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.