మనం ఎక్కిన బస్సు.. సడెన్గా ఆగిపోవడం చూశాం. ఒక్కసారైనా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు ప్రయాణీకులు. బస్సు రీపేరు కావడం వల్లే, టైరు పంచరు కారణంగా, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బస్సు ఆగిపోతూ ఉంటుంది.
మనం ఎక్కిన బస్సు.. సడెన్గా ఆగిపోవడం చూశాం. జీవితంలో ఒక్కసారైనా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు ప్రయాణీకులు. బస్సు రీపేరు కావడం వల్లే, టైరు పంచరు కారణంగా, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బస్సు ఆగిపోతూ ఉంటుంది. అయితే ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో మరో బస్సులో ఎక్కించడమో లేదంటే మరో బస్సును ఏర్పాటు చేయడమో చేస్తుంటారు అధికారులు. సాధారణంగా ఇదే జరుగుతుంది. కానీ కడప జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. బస్సును మధ్యలోనే ఆపేసి ప్రయాణీకుల్ని దించేయడమే కాకుండా..ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు వారికి. అదేమంటే పొంతన లేని కారణాలు చెప్పారని ప్రయాణీకులు వాపోతున్నారు.
అసలు ఏమైందంటే..? కడప నుంచి బద్వేల్కు 22 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. మార్గ మధ్యలో సిద్దవటం వద్దకు బస్సు రాగానే ఆర్టీసీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి.. అందరూ కిందకు దిగాలని చెప్పారు. మరో బస్సు వస్తుందని, అందులో ఎక్కి బద్వేలుకు వెళ్లాలని చెప్పారు. ఎందుకు దిగిపోమంటున్నారో అర్థం కాక ప్రయాణీకులు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. మరో బస్సు రావడం ఏంటనీ, ఈ బస్సుకు ఏమైందని ప్రశ్నించగా..చిత్తూరుకు వెళ్లాల్సిన బస్సు బ్రేక్ డౌన్ అయిందని, ఆ బస్సు ప్లేసులో ఈ బస్సును వెళ్ళమని తమకు ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారని డ్రైవర్, కండక్టర్ ప్రయాణీకులకు సమాధానం ఇచ్చారు.
దీంతో ప్రయాణీకులు తమ పరిస్థితి ఏంటని, తమను నడి రోడ్డుపై వదిలేయడం దారుణమంటూ మండిపడ్డారు. మరో 35 కిలోమీటర్లు వెళితే తమ గమ్య స్థానం చేరుకుంటామనగా.. ఇలా మధ్యలోనే వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా.. నడి రోడ్డుపై ప్రయాణీకులను వదిలేసి వెళ్లిపోవడం పట్ల ప్రయాణీకులు ఆందోళన చెందారు. మరీ ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది ఏం వివరణ ఇస్తారో చూడాలి.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.