నిజాయితీ, నిబద్ధత, సంకల్పం పునాదులుగా ప్రారంభమైన “సుమన్ టీవీ” నేటితో 7 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 8వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టింది. మొదటి నుండి శ్రమనే పెట్టుబడిగా భావించే స్వయం కృషీవలుడు సుమన్.. 2015 జులై 2న “PlayEven Info Pvt Ltd” పై “సుమన్ టీవీ”ని స్థాపించారు. ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలుని, ప్రతికూలతని, కష్టాన్ని ఆయన ఇష్టంగానే అధిగమించారు. ఈ కారణంగానే ఆనాడు ఒక్క ఉద్యోగితో, ఒక్క ఛానెల్ గా మొదలైన “సుమన్ టీవీ”.. 100 ఛానెల్స్ గా విస్తరించి, 350 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ.., సౌత్ ఇండియన్ అగ్రగామి వెబ్ ఛానెల్ గా అవతరించింది.
“సుమన్ టీవీ” అంటే కేవలం ఓ డిజిటిల్ న్యూస్ ఛానెల్ మాత్రమే కాదు. దాతృత్వాన్ని చాటుకోవడంలో కూడా “సుమన్ టీవీ” నేను సైతం అంటూ ఎప్పుడూ ముందడుగు వేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి “సుమన్ టీవీ” ప్రజా సేవలో భాగం అవుతూ వస్తోంది. లాక్ డౌన్ వేళ.. ఎందరో అభాగ్యులకు నిత్యావసరాలు అందించి అండగా నిలిచిన ఘనత “సుమన్ టీవీ” కే దక్కుతోంది. ఇవన్నీ కాక.., ప్రతిరోజు 100 మందికి పైగా పేదవారి ఆకలి తీర్చే అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని “సుమన్ టీవీ” నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ వస్తోంది. ఇలా 7 ఏళ్ళ ప్రస్థానంలో “సుమన్ టీవీ నెట్వర్క్” అందుకున్న విజయాలు, గమ్యాలు, ప్రశంసలు, ఎన్నో.. ఎన్నెన్నో. ఇక సుమన్ టీవీ సాగిస్తున్న ఈ జైత్రయాత్రలో ఉద్యోగుల సమిష్టి కృషి కూడా మరువలేనిది. భవిష్యత్ లో కూడా ఇలాగే మరెన్నో నూతన కార్యక్రమాలతో.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లీడింగ్ వెబ్ ఛానెల్ “సుమన్ టీవీ” సంసిద్ధంగా ఉందని సగర్వంగా తెలియచేస్తున్నాము.