తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ తన స్నేహితురాలైన ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సందర్భంగా శ్రేయోభిలాషులు ఉపాసనకు బహుమతులు పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాసనకు ఓ అపురూపమైన కానుక వచ్చినట్లు మీడియాలో ఒక పోస్ట్ వేసింది. వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. రామ్ చరణ్ అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంతోఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 14 తేదీన 11 వసంతాలు పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. మెగా వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసినప్పటి నుంచి అటు మెగా ఫ్యామిలీ.. ఇటు అభిమానులు సంతోషంతో మునిగిపోయారు. ఇక సెలబ్రెటీలు, సన్నిహితులు ఉపాసనకు బహుమతులు పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఉపాసనకు ఓ అపురూపమైన కానుక వచ్చింది.ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ ఉయ్యాల తయారు చేసి పంపించారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ.. ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘నాకు అసలు నమ్మశ్యంగా లేదు.. ఈ ఉయ్యాల ప్రజ్వల ఫౌండేషన్ లోని కొంతమంది అమ్మాయిలు స్వయంగా తయారు చేశారు. వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన యువతులు. వీరి నుంచి ఇంత అపురూపమైన కానుకు అందుకున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఉయ్యాల చేతితో తయారు చేసింది.. ఇది ఎంతో బలంగా ఉంది ’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.