సింగర్ కౌశల్య టాలెంట్ గురించి చెప్పనక్కర్లుదు. తెలుగులో అనేక హిట్స్ సాంగ్స్ పాడారు. మల్లి కూయవే గువ్వా, రా రమ్మని, రా రా రమ్మని వంటి సాంగ్స్ తో కుర్రకారును ఊర్రూతలూగించారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆమె తాజాగా సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
‘మల్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా, ఈ రోజే తెలిసిందీ నీలో దాగిన ప్రేమ, రా రమ్మని రారా రమ్మని రామ చిలుక పిలిచేను ఈవేలా, కొంచెం కారంగా, కొంచెం గారంగా’అంటూ మెస్మరేజ్ వాయిస్తో మనసుకు హత్తుకునే పాటలు పాడారు సింగర్ కౌశల్య. 1999తో నీకోసం సినిమాతో మొదలైన పాటల తోటలో ఎన్నో మంచి పాటలతో సినీ ప్రియులను ఓలలు ఆడించారు. మొత్తంగా 350కి పైగా పాటలు పాడారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం సవ్యంగా సాగలేదు. ఆమెను భర్త వేధిస్తున్నాడంటూ పలుమార్లు కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ అతడితో కలిసి ఉండేందుకు కారణాలను ఆమె సుమన్ టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
భర్త వేధించినా.. తన కుమారుడి కోసం అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, కానీ చివరికీ తన భర్తే తనను వదిలేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇప్పుడు తన కుమారుడు ఎదిగాడని, ఇప్పుడు అతడెంతో ప్రేమగా చూసుకుంటున్నాడని కౌశల్య తెలిపారు. అదేవిధంగా ఓ మంచి వ్యక్తిని రెండో వివాహం చేసుకోవాలని కుమారుడు సూచించినట్లు చెప్పారు. ‘ఇప్పటి వరకు తనను కష్టపడి పెంచిందీ చాలు, ఒంటరిగా ఉండొద్దు, నిన్ను బాగా చూసుకునే వాడు రావాలి’అని కోరుకుంటాడని పేర్కొన్నారు. తనకు తల్లిదండ్రులు లేరని, వారి ప్రేమను సరిగ్గా చూడలేదని, కానీ తన కుమారుడి ప్రేమను చవి చూస్తున్నట్లు తెలిపారు.
భర్త వల్ల ఎదుర్కొన్న అనేక సమస్యల గురించి వెల్లడించారు. తీవ్రంగా కొట్టేవాడని చెప్పారు. కొట్టడం సమస్యకు పరిష్కారం కాదని, సమస్యను కూర్చుని మాట్లాడాలని, సమస్య ఇదని చెబితే అర్థం చేసుకునేదాన్నని అన్నారు. తన చెల్లి పెళ్లి తరువాత తనను బాగా చూసుకుంటానని చెప్పాడని కానీ అతడిలో మారలేదని చెప్పారు. కార్తీకేయ కడుపులో ఉన్న సమయంలో కూడా హింసించినట్లు తెలిపారు. ఇలాంటి విషయాలపై అనేక మంది కూడా తమకు ఎదురైన సమస్యల గురించి చెబుతారని, వారికి తనదైన సలహాలు ఇస్తానని తెలిపారు. ముందుగా ఇండిపెండెంట్గా బతకాలని సూచించారు. తనకు సరైన వ్యక్తి తారసపడితే రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇంకా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.