సినిమా ప్రభావమో, మరేమిటో తెలియదు కానీ పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచుకున్నారు సామాన్యులు. పోలీసులు కనబడితే.. ఏదో తెలియని భయమైన భావంతో చూస్తుంటారు. కానీ ఏదైనా మనకు అన్యాయం జరితగితే.. ముందు మనల్ని పలకరించి, బాసటగా నిలిచేది రక్షకభటులే.
సినిమా ప్రభావమో, మరేమిటో తెలియదు కానీ పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచుకున్నారు సామాన్యులు. పోలీసులు కనబడితే.. ఏదో తెలియని భయమైన భావంతో చూస్తుంటారు. కానీ ఏదైనా మనకు అన్యాయం జరిగితే.. ముందు మనల్ని పలకరించి, బాసటగా నిలిచేది రక్షకభటులే. న్యాయం చేస్తామంటూ హామీనివ్వడమే కాదూ.. ఆ దిశగా తొలి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా తీసుకుని కూడా పనులు చక్కబెడుతుంటారు. తాము కఠినాత్ములం కాదని, తాము సామాన్యులమేనని, తమకు మంచి మనస్సు ఉందని నిరూపించుకుంటున్నారు. గతంలో వనపర్తి జిల్లా పానగల్ మండల ఎస్సై నాగన్న..స్వీపర్గా పని చేస్తున్న నిరుపేదకు ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు మరో ఎస్ఐ ఓ అవ్వ పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గొప్ప పని చేశారు.
ఇల్లు పాడైపోయి.. వర్షాలకు నీరు కారిపోతున్న ఇంటిని బాగు చేయించి మన్ననలు పొందుతున్నారు బంజారా హిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ముస్లిం అవ్వ ఇంటిని.. తన సొంత డబ్బులతో బాగు చేయించి ఇచ్చారు. రోడ్డు నెంబర్ 10, ఫిల్మ్ నగర్ లో జీవిస్తున్న ముస్లిం మహిళకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారికి పెళ్లిళ్లు అయ్యిపోయాయి. అయితే ఈ ముస్లిం మహిళ ఒక్కర్తే తన ఇంట్లో ఉంటోంది. ఆ ఇళ్లు ఇటీవల పాడైపోయింది. తన ఇంటిని బాగుచేయాలని ఓ మేస్త్రీని కలిసి డబ్బులిచ్చింది. అతడు పైపై పనులతో సరిపెట్టాడు. అయినప్పటికీ ఇల్లు కారడం ఆగలేదు.
చివరకు ఇళ్లు నీరు కారడంతో పాటు కొన్ని పనులు ఉండిపోవడంతో.. అతడిని కోరగా.. చేయలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మేస్త్రీని పిలవగా.. ఆమె డబ్బులివ్వలేదని చెప్పాడు. మొత్తం పనులు చేయాలని చెప్పగా.. ఆ తర్వాత అతడు పారిపోయాడు. ఎస్సై కరుణాకర్ రెడ్డి.. ఆమె ఇంటిని చూడగా.. ఇళ్లు కారడం చూసి.. చలించి.. తన సొంత డబ్బులు 50 వేలు ఖర్చు పెట్టి బాగు చేశాడు. దీంతో అతడి చేసిన సాయానికి కన్నీటి పర్యంతమైంది. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆశ్వీరదించింది. కాగా, ఇది తనకు చేయాలనిపించి చేశానని, ఇది తన డ్యూటీ అని కరుణాకర్ రెడ్డి చెప్పారు.