స్పెషల్ డెస్క్- ఆ రోజు భర్త ఎందుకో కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు. పడకగదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. తన భార్య స్థానిక నాయకుడితో అసభ్యకరంగా ఉంది. కోపోద్రిక్తుడైన భర్త ఆమెను చితకబాదాడు. ఐతే ఆమె డబ్బు కోసమో, సుఖం కోసమో ఆ పని చేయలేదు. మరో ఘటనలోను ఇలాగే జరిగింది. భార్య ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తే భర్తకు అనుమానం వచ్చింది. ఏంజరుగుతుందోనని రహస్యంగా ఆరా తీస్తే.. భయంకరమైన విషయం తెలిసింది.
కట్టుకున్న భార్య అధికార పార్టీకి చెందిన నేతతో అక్రమ సంభంధం పెట్టుకుంది. ఇక్కడ కూడా ఆమె డబ్బు కోసమే, అతనిపై వ్యామోహంతోనో సంబందం పెట్టుకోలేదు. దాని వెనుక మరో బలమైన కారణం ఉంది. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలన్నింటికి వెనుక సాధ్యమైనంత వరకు ఒకే కారణం కనిపిస్తోంది. అదే ప్రభుత్వ పధకాలు.
అవును వినడానికి కాస్త కొత్తగా, వింతగా ఉన్నా.. ఏపీలో ప్రభుత్వ పధకాల కోసం ఇలా మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాధారనంగా ఎదైనా ప్రభుత్వ పధకం మంజూరు చేయాలన్నా, చేయించాలన్నీ డబ్బును లంచంగా అడగడం మాములు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. స్థానిక నాయకులు ప్రభుత్వ పధకాలు మంజూరు చేయించాలంటే తన కోరిక తీర్చాలని మహిళలను డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానంగా జగనన్న ఇళ్ల పట్టాలు కావాలంటే తమకు లొంగిపోవాలని చాలా మంది స్థానిక నాయకులు వేధిస్తున్నారని తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె బంధువులకు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఆశ పెట్టి తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నారు చాలా మంది నేతలు. పైన చెప్పిన రెండు ఉదాహారణల్లో ఇదే జరిగింది. తన పేదరికం వల్ల సొంత ఇళ్లు లేని వాళ్లు, జగనన్న ఇళ్ల స్థలం పధకంలో ఇళ్లు వస్తుందన్న ఆశతో నాయకులకు లొంగిపోయారు.
ఇలా ఒకరిద్దరు కాదు, చాలా మంది ప్రభుత్వ పధకాల మంజూరు కోసం అధికార పార్టీకి చెందిన నేతలు మహిళలను లైంగింకంగా లొంగదీసుకుంటున్నారన్న విమర్శళు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మైలవరం నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి ఆయన అధికార పార్టీ తరఫున ఇన్ చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగనన్న ఇళ్ల పట్టాల మంజూరు నుంచి కొత్త పింఛన్ల వరకు ఆయన చెబితేనే పనవుతుంది.
దీంతో చాలా మంది లబ్ధిదారులు ఆయన దగ్గరకు వచ్చేవారు. అలా వచ్చినవారిలో ఓ మహిళపై ఆ నాయకుడి కన్ను పడింది. ఇళ్ల పట్టా ఆశచూపి ఈ నాయకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ నాయకుడికి లొంగిపోయింది. ఓ రోజు ఆమె భర్త ఇంటికి వచ్చే సమయానికి ఆ నాయకుడు ఆమెతో ఉన్నాడు. దీంతో ఆమె భర్త కత్తితో తన భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రి పాలై ప్రాణాలతో బయటపడింది.
కేవలం ఈ ఒక్క మహిళ విషయంలోనే కాదు ఆ వైసీపీ నాయకుడు తన కార్యాలయానికి ఏదైనా పనిమీద వచ్చే మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రలోభ పెట్టి లేదంటే ఆశ పెట్టి లొంగదీసుకుంటాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. మరి ఈ దారుణాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తడం లేదా, లేక వెళ్లిన చూసి చూడనట్లు ఉంటున్నారా అన్నదే సందిగ్దంగా ఉంది.