సరిగ్గా చదవకపోయినా.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినా.. క్రమశిక్షణతో మెలగకపోయినా.. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం సామాన్యం. అలా ఉంటేనే విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉన్నత స్థాయికి వెళ్తారు. కానీ.. ఇదేంత దారుణమో చూడండి.. పరీక్షల్లో మార్కులు సరిగా వేయలేదని ఏకంగా ఉపాధ్యాయులనే పాఠశాల విద్యార్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ వింత, అత్యంత దారుణమైన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ద్ముకా అనే గ్రామంలోని పాఠశాలలో చోటుచేసుకుంది.
తక్కువ మార్కులు వేసిన కారణంగా.. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. విద్యార్థులు ఆగ్రహించి ఇద్దరు ఉపాధ్యాయులను పాఠశాల ఆవరణలో ఉన్న ఒక పెద్ద చెట్టుకు తాడుతో కట్టేసి.. దారుణంగా చావబాదారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది విద్యార్థులు కూడా ఒక మార్కు తక్కువ వేయడంతోనే తాము ఫెయిల్ అయినట్లు.. అయిన ఒక్క మార్కు తక్కువ వేసి ఎలా ఫెయిల్ చేస్తారంటూ.. మీడియాలో మాట్లాడి నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు ఈ జార్ఖండ్ విద్యార్థులు మరింత ముందుకు వెళ్లి ఏకంగా ఉపాధ్యాయులపైనే దాడికి దిగారు. ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వారిపైనే ఇలా దాడికి తెగబడటంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jharkhand | School students in a village in Dumka tied their teachers to a tree & allegedly beat them up for providing fewer marks to them due to which they flunked their exams pic.twitter.com/P9slt1DjmB
— ANI (@ANI) August 31, 2022