హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన, పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. దానికి ముందు రోజు నరక చతుర్థతిగా ప్రసిద్ది పొందింది. దీపావళి పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ నిర్వహణ విషయంలో కొన్ని సందేహాలు తెర మీదకు వచ్చాయి. క్యాలెండర్లో దీపావళి అక్టోబర్ 25న అని ఉంది. కానీ దీపావళి పండుగ అంటే అమావాస్య రాత్రి వేళ చేసుకునేది. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య.. 24 సాయంత్రం నుంచి ప్రారంభం అయ్యి.. అక్టోబర్ 25 సాయంత్రానికి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.. అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నింటికి రమా రావి గారు సమాధానాలిచ్చారు. దీపావళి పండుగ ఏ రోజు చేసుకోవాలి.. ఆనాడు చేయాల్సిన కార్యక్రమాల గురించి తెలిపారు. సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.