వర్షాకాలం మొదలైంది. దేశ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ జల ప్రవాహంతో కళకళలాడుతున్నాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండల కొలిమిలో విలవిలలాడిన ప్రజలు
వర్షాకాలం మొదలైంది. దేశ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ జల ప్రవాహంతో కళకళలాడుతున్నాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కూడా కుండకు చిల్లులు పడినట్లు వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండల కొలిమిలో విలవిలలాడిన ప్రజలు.. ఈ వర్షాలతో కాస్త ఉపశమనం చెందుతున్నారు. వాన నీటిలో తడిసి ముద్దవుతున్నారు. ఇటు ఇలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కొద్ది పాటి వర్షాలకే రోడ్లు జలమయమౌతున్నాయి. నదుల్లోకి మెల్లగా వాన నీరు చేరుతుంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఈ సమయంలో వడగంట్ల వానలు ఎక్కువగా కురుస్తుంటాయి. అయితే ఏపీలో ఓ ప్రాంతంలో చేపల వర్షం కురియగా.. స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వజ్రపుకొత్తూరులో వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయట. రోడ్లపై చేపల వర్షం కురవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించడంతో పాటు వాటిని ఏరేందుకు వానలోనే పరుగులు తీశారు స్థానికులు. మునిపెన్నడూ లేని విధంగా చేపల కురవడంతో ఈ విషయం తెలిసిన చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి చూస్తున్నారు. వర్షాకాలంలో వడగండ్ల వాన, చేపలు వాన పడటం కామన్. టోరంటోలు, పెద్ద గాలులు ఏర్పడే సమయంలో నదులు, సముద్రంలో ఉండే చేపలు, కప్పల ఆవిరై.. మేఘాల్లోకి చేరుతాయి. అవి వర్షం పడిన సమయంలో భూమి మీద పడతాయన్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో కూడా చేపల వర్షం పడటంతో ప్రజలు వాటిని ఏరిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.