ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారు ‘మా’ అధ్యక్ష్య ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఇటువంటి సమయంలో ప్రకాష్ రాజ్ అభిమాని ఒకరు ఆయన గెలుపు కోసం ఏకంగా పాదయాత్ర చేపట్టాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరుకు చెందిన రంజిత్ కుమార్ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. రంజిత్ వ్యక్తిగతంగానూ ప్రకాశ్ రాజ్కు వీరాభిమాని. త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటూ కోలమూరు నుంచి హైదరాబాద్కు 485 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించాడు రంజిత్ కుమార్.
ఈ విషయం తెలిసి ప్రకాష్ రాజ్ కొంత అందోళన వ్యక్తం చేశారు. రంజిత్ బంగారం, నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది.. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది.. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి.. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసి మాట్లాడతాను.. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది.. అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు ప్రకాష్ రాజ్.
రంజిత్ బంగారం
నిస్వార్థం తో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసి మాట్లాడతాను. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది.🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/NhZMJ8WFAF— Prakash Raj (@prakashraaj) August 19, 2021