దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ దండయాత్ర కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. గడిచిన 10 రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది 9వ సారి. ఇవాళ కూడా ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసలు పెరిగాయి. హైదరాబాద్లో ఇంకాస్త ఎక్కువే పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
గురువారం(మార్చి31) రోజున హైదరాబాద్లో పెట్రోల్ రేటు 90 పైసలు పెరిగింది. దీంతో రేటు రూ.115.40కు చేరింది. ఇక డీజిల్ ధర అయితే 87 పైసలు పెరుగుదలతో రూ.101.56కు చేరింది. ఏపీ గుంటూరులో అయితే పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 83 పైసలు చొప్పున పైకి కదిలాయి. దీంతో పెట్రోల్ రేటు రూ.116.72కు, డీజిల్ ధర రూ.103.1కు పెరిగాయి. త్వరలో ఇంధన ధరలు 120 నుంచి 125 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరి పెరుగుతున్న ఇంధన ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.