టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయనను దేవుడిగా ఆరాధిస్తుంటారు అభిమానులు. ఆయన తెరపై కనిపిస్తే పూనకాలే. పవన్ సినిమా వస్తుందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయనను దేవుడిగా ఆరాధిస్తుంటారు అభిమానులు. మెగా ఫ్యామిలీకే బోలెడంత మంది ఫ్యాన్స్ ఉంటే.. అందులో పవన్ అభిమానులు వేరయా అన్నట్లు ఉంటుంది. ఆయన తెరపై కనిపిస్తే పూనకాలే. పవన్ సినిమా వస్తుందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. రాజకీయ పరంగా వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుండి సెలబ్రిటీల వరకు పవన్కు వీరాభిమానులున్నారు. మహిళా అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వితే చాలు పిచ్చెక్కిపోతుంటారు. అతని పట్ల ఎంతటి అభిమానం ఉందో తెలియజేసే సంఘటన ఇది.
ఆ మధ్య కాలంలో ఓ బామ్మకు మత్తు మందు ఇవ్వకుండానే బ్రెయిన్ ఆపరేషన్ చేసి కణతిని బయటకు తీశారు గాంధీ ఆసుప్రతి వైద్యులు. ఆమెకు ట్యాబ్లో చిరంజీవి సినిమా చూపిస్తూ, మధ్య మధ్యలో మాట్లాడిస్తూ వైద్యం చేశారు. అప్పట్లో ఈ వార్తను చూసి వైద్యులను ఎంతో ప్రశంసించారు. చిరంజీవి కూడా ఈ ఘటన పట్ల ఆనందరం వ్యక్తం చేస్తూ వైద్యుల కృషిని కొనియాడారు. ఇప్పుడు ఇటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలో పునరావృతమైంది. ఒడిశాకు చెందిన కిషోర్ ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. ఉపాధి నిమిత్తం సింగరాయ కొండకు వచ్చి పనులు చేస్తుండగా.. ఓరాయి వచ్చి అతడి తలపై పడింది. అతడికి తీవ్రంగా గాయమవ్వడంతో సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. కిషోర్ తలను పరిశీలించిన వైద్యులు, కుట్లు వేయాలని చెప్పారు.
అయితే మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అతడికి మైకం రాలేదు. కుట్లు వేయాలంటే మనిషి కదలకూడదు.. మత్తు ఎక్కితేనే వైద్యం చేయగలిగే పరిస్థితి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుండగా.. తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని, ఆయన సాంగ్స్ పెడితే చూస్తూ కుట్లు వేయించుకుంటానని తెలిపారు. ఆశ్చర్యపోయిన వైద్యులు..పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టి కుట్లు వేశారు. ఈ చిన్న ఆపరేషన్ చేస్తున్నంత సేపు పాటలు చూస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానమంటే ఇట్టా ఉంటదా సామి అని కామెంట్లు పెడుతున్నారు.