ఫిల్మ్ డెస్క్- ఈ నెల 23 నుంచి తెలంగాణలో సినిమా ధియేటర్స్ తెరుచుకుంటున్నాయి. దీంతో సినిమా ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాలు ధియేటర్స్ లో చూడకుండా కేవలం టీవీల్లో మాత్రమే చూసిన ప్రేక్షకులు, 23నుంచి నేరుగా ధియేటర్స్ లో సినిమాలు చూడబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ సర్కార్ సినీ ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ సినిమా థియేటర్స్ లో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల విషయంలో మాత్రం పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం పేర్కొంది. మామూలు థియేటర్స్ లో వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ తెలంగామ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 2018లో వాహనాల పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 63ను సవరించింది. ఐతే మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సముదాయాల విషయంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సినిమా థియేటర్ల వద్ద బయటి వారు సైతం వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం, పర్యవేక్షణ లేకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ధియేటర్ల యాజమాన్యాలు విప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి.
దీంతో థియేటర్ల వద్ద నిలిపి ఉంచే వాహనాలకు నిర్ణీత రుసుము వసూలు చేసి వాటి పర్యవేక్షించాల్సిందిగా సర్కార్ ఆదేశించింది. ఈ నెల 23 నుంచి తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరుచుకుంటున్నాయి.