ఓడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతిచెందారు అనే విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను అక్కడ ఉంచిన స్థానిక పాఠశాలను కూల్చివేయమని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే కు మీడియా నుంచి తెలిపారు.
ఓడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతిచెందారు అనే విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను అక్కడ ఉంచిన స్థానిక పాఠశాలను కూల్చివేయమని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే కు మీడియా నుంచి తెలిపారు. ఆ రైలు ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న బాహాగానా ప్రభుత్వ పాఠశాలలో ఆ జిల్లా నుంచి ఓ యంత్రాంగం క్యాంపు ఏర్పాటు చేసింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారీ బాడీలను అక్కడికి పంపియమని కోరింది. ఈ నేపథ్యంలో పాఠశాలలోని ప్రేయర్ రూంతో సహా.. కొన్ని తరగతి గదుల్లో కూడా మృతదేహాలను ఉంచారు. అయితే ఆ మృతదేహాలను కొన్నింటిని మార్చురీకి తరలించారు. అలా ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావాలంటే అక్కడ ఉన్న విద్యార్థినులు చాలా భయాందోళనకు గురవుతున్నారు.అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని అదికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
అక్కడితో ఆ మృతదేహాలను ఉంచిన స్కూల్ ను ఉంచుకోవడం మంచిది కాదని ఆ హైస్కూలును కూల్చీవేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే శవాలను ఉంచిన రూమ్ లను కూల్చీవేయడానికి మేనేజింగ్ కమీటీని ఆమోదిస్తే.. ఆ గదులను కూల్చీవేసి కొత్త గదులను నిర్మిస్తామని ఆమోదం ఇచ్చారు.దీనిపై పాఠశాల కమిటీ వెంటనే సమావేశమై కూల్చీవేతకు ఆమోదం తెల్పినట్లు.. అయితే శుక్రవారం రోజున కూల్చీవేత పనులు ప్రారంభించినట్లు కలెక్టరు తెలిపారు. అలా తెల్పగా.. కొత్త భవనాలు నిర్మించిన తర్వాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించి.. ఆ తర్వాత స్కూల్ పున:ప్రారంబిస్తామని ఆయన తెలిపారు. అయితే ఇంకా ఒరిస్సా రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు జూన్ 19 వ తేదీన ముగించనున్నాయి.