Nellore Locals Opposed Anandaiah Corona Medicine Distribution
కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఆయన స్వగ్రామంలోని ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఆనందయ్య ఇంటి ముందు ధర్నాకు దిగి.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఒమిక్రాన్కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : ఒమిక్రాన్ కు మందు రెడీ అంటున్న ఆనందయ్య! త్వరలో పంపిణీ!
ఆనందయ్య ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు నిలదీశారు. అయితే ఆనందయ్య వాదన మరోలా ఉంది.. మందు పంపిణీకి అనుమతి ఉందని.. మందు కోసం చాలామంది వస్తున్నారని.. కావాలనే కొందరు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులు ధర్నా చేయడమే కాక ఆనందయ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆనందయ్యతో చర్చించారు.. పర్మిషన్ లెటర్ చూపించాలని కోరారు.
ఇది కూడా చదవండి : బీసీల కోసం త్వరలో రాజకీయ పార్టీ.. ఆనందయ్య సంచలన ప్రకటన