బుల్లితెర డెస్క్- నా పేరు మీనాక్షి.. ఈ సీరియల్ తెలుగులో బాగా ప్రేక్షకాధరణ పొందుతోంది. ఈ సిరియల్ లో లీడ్ రోల్ పోషిస్టున్న నవ్యస్వామి నటించడంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా యక్టీవ్ గా ఉంటుంది. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్యస్వామి చాలా విషయాలను చెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా కష్టాలు పడ్డానని ఆవేధన వ్యక్తం చేసింది నవ్య.
తెలుగు టీవీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తెలుగు అస్సలు రాదని, కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడటం, చదవటం కూడా వచ్చని చెప్పారు నవ్యస్వామి. ఇక పరిశ్రమలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని, అందులో నటి, యాంకర్ హరితేజ ఒకరని చెప్పుకొచ్చారు. హరితేజతో పరిచయం తరువాత, ఆమె భర్త కన్నడ వాడు కావడంతో మరింత క్లోజ్ అయ్యామని తెలిపారు నవ్య.
అలా హరితేజ భర్త కన్నడకు చెందిన వారు కావడంతో ఇంకాస్త సన్నిహితంగా మారానని చెప్పిన నవ్య కామెంట్ పై హరితేజ రీసెంట్ గా స్పందించారు. హరితేజ, నవ్యస్వామి కలిసి సందడి చేయడం సర్వసాధరనమే. తాజాగా ఈ ఇద్దరూ జిమ్ పార్ట్నర్స్గా మారిపోయారు. ఇద్దరూ కలిసి ఒకేసారి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హరితేజ.
వీరిద్దరి వర్కవుట్స్ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరో వైరు నవ్యస్వామి బిగ్ బాస్ సీజన్ 5 షోలో ఎంట్రీ ఇవ్వబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో నిజమెంత అన్నదానిపై నవ్య మాత్రం స్పందించలేదు.