ఈ మధ్య ప్రాంక్ వీడియోలు బాగా సందడి చేస్తున్నాయి. కుర్ర నా గొడుగులు ప్రాంక్ వీడియోల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రోడ్డు మీద పరిచయం లేని అమ్మాయికి ప్రపోజ్ చేయడం, అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం, అమ్మాయిని ఏ వస్తావా అని అడిగి కొట్టించుకోవడం, చిల్లరగా బిహేవ్ చేయడం లాంటివి చేస్తున్నారు. అదంతా స్రిప్టు.. స్రిప్టు అని జనానికి తెలుసు. జనానికి తెలుసన్న విషయం ఈ ప్రాంకులు చేసే సన్నాఫు గాళ్ళకి కూడా తెలుసు. అయినా గానీ జనాన్ని ఎగ్ పఫ్ లు చేస్తున్నామన్న దృష్టిలో ఇంకా పాన్ పరాక్ ప్రాంక్ వీడియోలు చేస్తూనే ఉంటారు. సందర్భం వచ్చింది కాబట్టి వీళ్ళ గురించి ప్రస్తావించవలసి వచ్చింది. ప్రాంక్ వీడియోల మాదిరిగానే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోహిత్ గౌహర్ అనే యువకుడు టవల్ కట్టుకుని.. పైన ఒక జబ్బల బనియన్ వేసుకుని మెట్రో రైలు ఎక్కాడు. రైల్లో ఉన్న జనమంతా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అని ఫీలవుతుంటే.. యువకుడు మాత్రం మెట్రో రైలు అద్దంలో అందంగా ఉన్నాడో లేదో చూసుకుంటున్నాడు. జుట్టు సరి చేసుకుంటున్నాడు. యువకుడి పిల్ల చేష్టలకి ట్రైన్ లో ఉన్న జనం నవ్వుకున్నారు. ప్రాంక్ వీడియో ఏమో అని అనుకుంటారు. కానీ ప్రాంకు కాదు. అతను అలా టవల్, బనియన్ మీద రైలు ఎక్కడం వెనుక కారణం ఉంది. బాత్రూం లో స్నానం చేస్తుంటే ట్యాంక్ లో నీళ్లు అయిపోయాయట. అందుకే ఆఫీస్ లో స్నానం చేయడానికి వెళ్తున్నా రాసుకొచ్చి.. ఈ వీడియోని షేర్ చేశాడు.
ట్యాంక్ లో నీళ్లు అయిపోతే మాత్రం టవల్ మీద రైలెక్కాలా? శుభ్రంగా ప్యాంటు, షర్టు వేసుకుని రావచ్చుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఇలానే చేయాలి. చేయడంలో తప్పు లేదని సమర్థిస్తున్నారు. ఆఫీస్ లో స్నానం చేస్తా అన్నావ్ చూడు, నీ ధైర్యానికి, నీ కాన్ఫిడెన్స్ కి టేక్ ఏ బౌ అంటున్నారు. అయితే అతను టవల్ మీద, బనియన్ మీద ట్రైన్ లో తిరుగుతుంటే ఎవరూ ఏమీ అనకపోగా.. ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ యువకుడ్ని మెట్రో స్టేషన్ లోకి ఎలా రానిచ్చారో అన్నదే ఆశ్చర్యం కలిగిస్తుంది. బాబు నిబ్బా గాళ్ళలా గాల్లో ఎగరడాలు, పైన రాడ్లు పట్టుకుని కుప్పి గంతులు చేయడాలు లాంటి స్టంట్లు చేయలేదు కాబట్టి సరిపోయింది.
లేదంటే అతని ఇన్స్ట్రుమెంట్ దెబ్బతినేది.. ఆ దృశ్యం సినిమా చూసి జనాల హార్ట్ లకి స్టంట్లు పడేవి. యువకుడు అతని ఆఫీసుకి కాకుండా.. నీళ్లు రాకపోవడానికి కారణమైన అధికారుల ఆఫీస్ కి పోయి అక్కడ స్నానం చేసి ఉంటే ఇంకా బాగా హైలైట్ అయ్యేవాడు. జనం దృష్టిలో హీరో అయ్యేవాడు. మరి ఈ యువకుడికి వచ్చిన సమస్య మీకొస్తే ఏం చేస్తారు? టవల్ కట్టుకుని సరాసరి ట్రైన్ ఎక్కుతారా? లేక నీటి సమస్యకి కారణమైన ప్రభుత్వ అధికారుల ఆఫీసులకి వెళ్తారా? మనకెందుకండీ ఈ పంచాయితీలు.. ఆఫీసుకి సెలవు పెట్టి శుభ్రంగా రెస్టు తీసుకుంటాం అని అంటారా? మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లేదంటే లేదు.