దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొంతమంది కామాంధులు మారడం లేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే గౌరవమైన స్థానంలో ఉన్న ఒక లెక్చరర్ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఓ కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని బెళగావి ప్రభుత్వ సర్దార్ పీయూ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు అమిత్ బసవమూర్తి. గత కొంత కాలంగా ప్రతి రోజూ మద్యం సేవించి కాలేజ్ కి వచ్చేవాడు. అలాగే మహిళా సిబ్బంది కనిపిస్తే చాలు పిచ్చి కుక్కలా రెచ్చిపోతూ వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతే కాదు సహ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. పరుష పదజాలంతో దూషించేవాడు.
ఈ లెక్చరర్ బాధలు భరించలేక కళాశాల మహిళా సిబ్బంది.. ప్రిన్సిపల్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక లాభం లేదని అనుకున్న మహిళా సిబ్బంది లెక్చరర్ కి సరైన బుద్ది చెప్పాలని నిర్ణయించకున్నారు. మహిళా సిబ్బంది బసవమూర్తిని కాలితో తన్ని, కర్రతో చితకబాదారు. చెప్పులతో దేహశుద్ధి చేశారు. అలాగే నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.