ఒక రాజుకు ఉండే ప్రధాన కర్తవ్యం తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవడం. వారికి పొంచి ఉన్న ప్రమాదాలను ముందే కనిపెట్టి వారి ప్రజలను రక్షించుకోగలగాలి. దాడి ఎంత అవసరమో.. ఆత్మరక్షణ కూడా అంతే అవసరం. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా దేశాల నేతల కంటే ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని నిరూపించుకున్నారు. భావి భారత పౌరులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా.. ఏ మూల ఉన్నా కూడా వారి రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడరని మరోసారి రుజువు చేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చి శభాష్ మోదీ అనేలా చేశారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు వేడెక్కిన విషయం తెలిసిందే. అక్కడ యుద్ధ వాతావరణ నెలకొందని కొద్ది రోజుల క్రితం నుంచే అందరికీ తెలుసు. కానీ, చాలా దేశాలు దానిని సీరియస్ గా తీసుకోలేదు ఒక్క మోదీ తప్ప. మన దేశ పౌరులు ఉక్రెయిన్ ను వదిలి వచ్చేయాలని కొద్ది రోజుల ముందే ప్రకటించారు. అలా చెప్పి చేతులు దులుపుకోకుండా ఉక్రెయిన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మన దేశ పౌరులు, విద్యార్థులకు ఏ కష్టం రాకుండా స్వదేశం చేరేలా చర్యలు తీసుకున్నారు. యుద్ధానికి కొద్ది నిమిషాల ముందు కూడా ఉక్రెయిన్ నుంచి ఓ విమానం ఢిల్లీ చేరింది. ఎందరో విద్యార్థులు సురక్షితంగా తమ తల్లిదండ్రులను చేరుకున్నారు.
ఈ విషయంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మోదీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన ముందు జాగ్రత్త చర్యలు, ముందుచూపుతోనే వారి పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరారంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సాధ్యమైనంత వరకు పౌరులు, విద్యార్థులను స్వదేశానికి చేర్చారు. ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ భారత విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. మోదీ నిర్ణయంతోనే ఇంత త్వరగా విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.