ప్రతి మనిషి ఆశ అనేది ఉంటుంది. అదే జీవితాన్ని నడిపిస్తుంది. ప్రతి ఒకరి ఏదో ఓ ఆశ ఉంటుంది. దానికోసం శ్రమిస్తారు. అలానే ఓ గ్రామ ప్రజలు ఒక్కటంటే ఒక్క వజ్రం దొరికితే చాలు.. జీవితమే మారిపోతుంది.. అంటూ కొంతమంది అదే పనిగా వజ్రాల కోట వేట కొనసాగిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మధ్య ప్రదేశ్లోని భోపాల్కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు సమాచారం. అయితే అటవీశాఖ, మైనింగ్ అధికారులు మాత్రం వారిని అడ్డుకుంటూ కేసులు పెడుతున్నారు.. పన్నా నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ వజ్రాల కోసం వేట కొనసాగుతోంది. తమ జీవితాన్ని మార్చగల ఒకే ఒక వజ్రాన్ని దొరకబుచ్చుకోవాలనే ఆశతో ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విలువైన రాళ్ల అక్రమ మైనింగ్ను అరికట్టడానికి అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.
ఈ మధ్య జరిపిన దాడిలో మైనింగ్లో పాల్గొన్న వ్యక్తులు తప్పించుకోగా.. 37 బైక్లు.. డైమండ్ గనులు తవ్వడానికి ఉపయోగించే పరికరాలను పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పన్నాలోని నార్త్ ఫారెస్ట్ డివిజన్లో ఉండే విశ్రమ్గంజ్ ఫారెస్ట్ సర్కిల్లోని గనుల ప్రాంతంలో.. ప్రజలు రోజూ వజ్రాల కోసం తవ్వుతుంటారు. ఇక్కడి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం రంజ్ నదిపై కాంపోజిట్ డ్యామ్ను నిర్మిస్తోంది.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.