ఇటీవల ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చి దిద్దుతున్నామని.. పిల్లలకు మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాయి ప్రభుత్వాలు. కొన్ని చోట్ల విద్యార్థులకు కూర్చోడానికి సరైన వసతులు లేక ఆరు బయట కూర్చుకుంటున్నారు. సరైన భవనాలు లేక టీచర్లు పాఠాలు బయటనే చెబుతున్నారు. మరికొన్ని చోట్ల భవనాలు శిథిలావస్తకు చేరి పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు తూతూ మంత్రంగా రిపేర్లు చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా జయంతిపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంతో అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఎంతగా అంటే అసలు అక్కడ కూర్చోడానికి బల్లలు లేవు.. పిల్లలను నేలపైనే కూర్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌళిక వసతి లేకపోవడంతో పిల్లలు ఎండలో కూర్చొని టీచర్లు చెప్పే పాఠాలు వింటున్నారు. చుట్టు పక్కల అంతా మురికి వాతావరణం కనిపిస్తుంది. పాఠశాల గతి పూర్తిగా శిథిలావస్తలో ఉన్నందునే పిల్లలను బయట కూర్చోబెట్టినట్లు తెలుస్తుంది.
ఇక్కడ పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని.. తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉన్నా పెద్దగా పనిచేయవని అంటున్నారు ఉపాధ్యాయులు. ఇక లైట్ వసతి లేక రూమ్ చికటిగా మారిపోతుందని.. అందుకే పిల్లలను బయట కూర్చోబెట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రభుత్వం అరకొరగా కల్పించే సదుపాయాలు సరిపోవడం లేదంటున్నారు. విద్యార్థుల దయనీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెంటనే అధికారులు స్పందించి వారికి సరైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Uttar Pradesh | Children made to sit in the sun at a primary govt school in Jayantipur, Moradabad district due to a lack of facilities there (17.05) pic.twitter.com/LREi0cyPqu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 18, 2022