కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించినట్లు సమాచారం. ఎయిమ్స్ లోని ప్రైవేటు వార్డులో నిర్మలా సీతారామన్ కు వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆవిడ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు నిర్మలా సీతారామన్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారా? లేక ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
డైనమిక్ ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ పేరు సంపాందించుకున్నారు. ప్రస్తుతం ఆవిడ ఆస్పత్రిలో చేరారు అనే వార్తలతో రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నిర్మలా సీతారామన్ కు ఏమైంది అనే వెతుకులాస ఎక్కువగా ఉంది. అయితే ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది అనే వార్తలు బయటకు రావడంతో పలువురు నేతలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు నిర్మలా సీతారామన్ హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేస్తారని చెబుతున్నారు.
From PTI | Finance Minister Nirmala Sitharaman is hospitalised pic.twitter.com/r3OeWpEWKA
— CNBC-TV18 (@CNBCTV18Live) December 26, 2022