దేశంలో ఇప్పుడు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పని సరి అయిపోయింది. దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడి దగ్గర ఆధార్ కార్డు తప్పని సరి ఉండాల్సిందే. ఈ కార్డును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. ఆధార్ లో పుట్టిన తేది, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ తో పాటు మనం ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ కి సంబంధించిన డాక్యూమెంట్స్ సమర్పిస్తే వాటిని పరిశీలించి యూఐడీఏఐ ఆధార్ కార్డు జారీ చేస్తుంది.
గత పదేళ్లుగా ఆధార్ కార్డును అప్ డేట్ చేయని వారికి ఒక ముఖ్య సూచన జారీ చేసింది యూఐడీఏఐ. ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన తర్వాత తప్పని సరిగా రెసిడెన్స్, ఫోన్ వివరాలు మరోసారి సమర్పించాల్సి ఉంటుందని యూఐడీఏఐ సూచించింది. పదేళ్ళుగా ఆధార్ అప్ డేట్ చేయని వారు ఈ పని తప్పకుండా చేయాలని తెలిపింది. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ కోసం సమర్పించిన బయోమెట్రీక్ డేటాను తప్పకుండా అప్ డేట్ చేయాలని ఆధార్ కార్డు ఉన్న వారు స్వచ్ఛందంగా మై ఆధార్ పోర్టల్ లో కానీ.. దగ్గరలోని ఆధార్ కేంద్రంలో కానీ అప్ డేట్ చేయించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆధార్ ద్వారా దేశ పౌరులందరికీ ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కార్డును జారీ చేస్తుంది. ఈ నెంబర్ తో లాగిన్ అయితే మనకు సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయి. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఆధార్ సేవా కేంద్రంలో వారి బయోమెట్రిక్ వివరాలు ఇచ్చి అప్ డేట్ తప్పకుండా చేయించాలి. ఆధార్ కార్డు జారీ చేసే ముందు ఐరిష్, వెలి ముద్రలు, ఫోటోని ప్రామాణికంగా తీసుకుంటారు. మరి మీరు ఆధార్ తీసుకొని పదేళ్లు దాటితే వెంటనే దగ్గరలోని ఆధార్ కేంద్రంలో అప్డేట్ చేయిస్తే మంచిది.
ఇది చదవండి : అన్నదాతలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు!