అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇక కేంద్రం కూడా ఇలాంటి పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద కేంద్రం రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 11 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం చేయగా.. తాజాగా 12వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే రైతుల ఖాతాలో ఆ డబ్బులను జమ చేస్తారు. దీపావళి కన్నా ముందుగానే డబ్బులు విడుదల చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు 11 విడతల్లో నిధులు విడుదల చేయగా.. తాజాగా 12వ విడత ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. దీపావళి కన్నా ముందుగానే అన్నదాతల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేయనున్నారు. అక్టోబర్ 17, 18 తేదీల్లో ఈ డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది.
అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ అండ్ కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా రూ.2 వేలు విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతాయి. కనుక అన్నదాతలు కచ్చతంగా ఇకేవైసీ చేసుకొని ఉండాలి. లేదంటే ఈ డబ్బులు రావు. పీఎం కిసాన్ స్కీమ్ పథకం కింద ఆర్థిక సాయం రాని వారు.. ఎవరైనా ఉంటే.. 011 24300606 /011 23381092 హెల్ప్లైన్ నంబర్లుకు నేరుగా కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్, pmkisan ict@gov.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలిపారు.