ఈ భూమి మీద తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ఆమె తన బిడ్డల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధపడుతుంది. ఇక అలాంటి పరిస్థితే వస్తే.. బిడ్డల ప్రాణాల కోసం తమ ప్రాణాలను అడ్డు వేయడానికి కూడా వెనుకాడదు. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలను మనం చూశాం. బిడ్డను కాపాడేందు చిరుత, పులితో పోరాడిన తల్లుల గురించి మనం అనేకం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. హైనా నోటిలో చిక్కుకున్న తన ఆరునెలల బిడ్డను కాపాడేందు వీరోచిత పోరాటం చేసింది. బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను లెక్క చేయలేదు. శరీరం నుంచి రక్తం కారుతున్న భయపడక..బిడ్డను కాపాడేందుకు చావు అంచుల వరకు వెళ్లింది. చివరకు తన బిడ్డను కాపాడింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని కోటక పట్టణానికి సమీపంలోని ఇటవా అనే గ్రామంలో తులజ భాయి అనే మహిళ తన భర్త పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమెకు బిశ్రా అనే ఆరునెలల కూమార్తె ఉంది. తన ఆరు నెలల కుమార్తెతో కలిసి గెదేలను మేపేందుకు అడవికి వెళ్లింది. కూతురుని ఓ చెట్టు వద్ద ఉంచిన తులజ..గెదేల వద్దకు వెళ్లింది. అంతలోనే హైనా ఆ చిన్నారి వద్దకు వచ్చింది. ఆ బిడ్డను నోట కరుచుకుని పరుగెత్తింది. దీంతో ఆ పసిపాప గట్టిగా ఏడుస్తుంది. ఆ పాప అరుపులు విన్న తులసి భాయ్ అటువైపు చూసింది. హైనా నోట్లో పాప ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయింది. తన బిడ్డను రక్షించుకునేందుకు హైనా వెంట ఆ మహిళ పరుగులు తీసింది. పెద్ద కర్ర తీసుకుని కేకలు పెడ్డుతూ హైనాను వెంబడించింది.
కొద్ది దూరం వెళ్లాక.. హైనా వెనుక కాళ్లను కర్రతో కొట్టింది. దీంతో హైనా ఆ పసిబిడ్డను వదిలేసి.. తులజాపై దాడికి దిగింది. ఆమెను హైనా తీవ్రంగా గాయపర్చింది. అయిన ఆమె భయపడక ధైర్యంతో దానితో పోరాడింది. చాలా సమయంపాటు తల్లికి.. ఆ కూర్ర జంతువుకు మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఆమె వీరోచిత పోరాటం ముందు ఎదురు నిలవలేని హైనా తొక్క ముడిచి పారిపోయింది. అయితే ఈ హైనా దాడిలో ఆ నెలల పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తనకూ గాయాలయ్యాయి అనే సంగతి మరచి కూతురు తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీసింది. ఆస్పత్రిలో వైద్యలు సకాలంలో తల్లిబిడ్డలకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.